sai satcharitra telugu – సాయి సచ్చరిత్ర పూర్వసంప్రదాయానుసారము హేమాడ్ పంతు శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. 1.ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంథరచనకు 2. పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీసాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు 3. తదుపరి సృష్టిస్థితి లయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి, …
