అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న
రాగం: హిందోళం (20 నటభైరవి జన్య)
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అవ: స ని2 ద1 మ1 గ2 స
తాళం: ఆది
పల్లవి
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (2.5)
చరణం 1
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు । (1)
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥ (2.5)
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.)
కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (ప.)(2.5)
చరణం 2
అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు ।
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ॥
చరణం 3
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తన యెడకు రప్పించిన వాడు । (2)
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ॥ (2.5)
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.)
కొండలంత వరములు గుప్పెడు వాడు (ప.) (2.5)